రొమాంటిక్ థ్రిల్లర్

16 Dec, 2014 23:42 IST|Sakshi
రొమాంటిక్ థ్రిల్లర్

ఖయ్యుమ్, సంచితా పదుకొనే జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. కేదారేశ్వరరెడ్డి దర్శకుడు. షేక్ అలీబాషా నిర్మాత. ఈ చిత్ర షూటింగ్ శనివారం హైదరాబాద్‌లో మొదలైంది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిదనీ, సింగిల్ షెడ్యూల్‌లో వైజాగ్, హైదరాబాద్‌ల్లో చిత్రీకరణ జరుపుతామనీ దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజేశ్ వర్మ.