కేరాఫ్‌ తూర్పు గది

16 Jun, 2017 00:18 IST|Sakshi
కేరాఫ్‌ తూర్పు గది

మున్నా, ప్రియాంక, మధుశ్రీ ముఖ్య తారలుగా శరగడం శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రోషిణి కేరాఫ్‌ తూర్పుగది’. శ్రీవారి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.శ్రీనివాస్, ఎస్‌.సుధీర్‌ నిర్మిస్తున్నారు. రాజ్‌ కిరణ్‌ సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘హార్రర్‌తో కూడిన కామెడీ చిత్రమిది.

భువనగిరి గౌరీ శంకర్‌ విలన్‌గా, రంజీత్‌కుమార్‌ పోలీసాఫీసర్‌గా తమ పాత్రలకు న్యాయం చేస్తున్నారు. పాలకొల్లు, నర్సాపురంలో తర్వాతి షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నాం. రాజ్‌కిరణ్‌ మంచి పాటలు ఇచ్చారు’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: నండూరి వీరేషం.