టాలీవుడ్లో భారీ మల్టీస్టారర్గా తెరకెక్కతున్న సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి, రామ్చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేయడానికి చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి సినిమా కథా కథనాలు, నటీనటుల విశేషాలను వెల్లడించారు.
ఆర్ఆర్ఆర్ 1920లో ఉత్తర భారతదేశంలో జరిగే కథగా తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించారు రాజమౌళి. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు ఒకే సమయంలో కలిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఫిక్షనల్ పాయింట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించారు రాజమౌళి. ఈ సినిమాలో రామ్ చరణ్.. సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం కనిపించనున్నారు.
భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారని తెలిపారు. ఫ్లాష్బ్యాక్లో వచ్చే పవర్ఫుల్ పాత్రలో అజయ్ కనిపించనున్నారు. ఇక చరణ్కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారని, ఎన్టీఆర్కు జోడిగా విదేశీ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ కనిపించనున్నారని వెల్లడించారు. మరో కీలక పాత్రలో తమిళ నటుడు సముద్రఖని నటిస్తున్నారు. 2020 జూలై 30న తెలుగు, హిందీ, తమిళ, మళయాల భాషలతో పాటు దాదాపు 10 భారతీయ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత దానయ్య తెలిపారు.