వాటిని పట్టించుకోకండి.. అభిమానులు ప్రశాంతంగా ఉండండి

4 May, 2019 13:43 IST|Sakshi

రాజా రాణి సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన యువ దర్శకుడు అట్లీ.. తేరి, మెర్సెల్‌ లాంటి చిత్రాలతో ఘన విజయాలు నమోదు చేశాడు. సినిమా సినిమాకు సక్సెస్‌ రేట్‌తో పాటు బాక్సాఫీస్‌ కలెక్షన్లను పెంచుకుంటూ పోతూ ఉన్న ఈ దర్శకుడు ముచ్చటగా మూడో సారి విజయ్‌తో ఓ  మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

విజయ్‌ 63వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్‌లో మహిళను వేధించాడని డైరెక్టర్‌ అట్లీపై వార్తలు వినిపించాయి. అయితే ఇలాంటి వార్తలను పట్టించుకోకండంటూ.. మీరు థియేటర్స్‌లో పండుగ చేసుకునేలా సినిమా రావాలని ఎంతో కష్టపడి 70 రోజుల నుంచి నిరంతరాయంగా షూట్‌ చేస్తున్నామని చిత్రయూనిట్‌లోని ఓ సభ్యుడు తెలిపారు. ప్రస్తుతం నాలుగో షెడ్యూల్‌లోకి ఎంటరవుతున్నామని అన్నారు. సినిమాకు సంబంధించి అప్‌డేట్స్‌ను సరైన సమయంలో చెబుతామని అంత వరకు అభిమానులంతా ప్రశాంతంగా ఉండాలని, రూమర్స్‌ను పట్టించుకోవద్దని కోరారు.

మరిన్ని వార్తలు