సాహో : రొమానియాలో మరో భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌

20 Oct, 2018 12:48 IST|Sakshi

బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2019 సమ్మర్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే దుబాయ్‌లో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరించిన చిత్రయూనిట్‌ త్వరలో మరో యాక్షన్‌ సీన్‌కు రెడీ అవుతున్నారు.
 

ఈ సారి రొమానియాలో ఓ భారీ చేజ్‌ను చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్‌ లో ప్రభాస్‌తో పాటు ప్రతినాయక పాత్రలో నటిస్తున్న నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కూడా పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. సాహోతో పాటు రాధకృష్ణ దర్శకత్వంలో పిరియాడిక్‌లవ్‌ స్టోరిలోనూ నటిస్తున్నాడు ప్రభాస్‌. ఈ రెండు సినిమాలు 2019లోనే రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు