బండ్ల గణేష్పై చీటింగ్ కేసు పెట్టిన హీరో

25 Jun, 2015 12:44 IST|Sakshi
బండ్ల గణేష్పై చీటింగ్ కేసు పెట్టిన హీరో

హైదరాబాద్ :  ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై చీటింగ్ కేసుతో పాటు చెక్ బౌన్స్ కేసు నమోదు అయింది.  'నీ జతగా నేనుండాలి' సినిమా వివాదంపై బండ్ల గణేష్ లీగల్ నోటీసులు అందుకున్నారు. వైకింగ్ మీడియా సంస్థ బండ్ల గణేష్ కు నోటీసులు పంపింది. హీరో సచిన్ జోషి...వైకింగ్ మీడియా సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. 'ఆషికి 2'  చిత్రాన్ని నీ జతగా నేనుండాలి పేరుతో తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయ రవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే  నీ జ‌త‌గా నేనుండాలి సినిమాకీ గ‌ణేష్ ప్రొడ్యూస‌ర్‌గా ఉన్నప్పటికీ ఆ సినిమా నిర్మాణానికి పెట్టుబడి పెట్టింది సచిన్ జోషినే. అయితే ఆ సినిమా విషయంలో గ‌ణేష్ త‌న‌ని మోసం చేశాడ‌ని, డిస్ట్రిబ్యూషన్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని  వైకింగ్ మీడియా ఫిర్యాదు చేసింది. సినిమా బాగానే ఆడినప్పటికీ లాభాల్లో వాటా ఇస్తాన‌ని చెప్పి... చివ‌రికి న‌ష్టాలు వచ్చాయని బండ్ల గణేష్ త‌ప్పుడు లెక్కలు చూపినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.