సాగర తీరంలో ప్రేమ

17 May, 2018 05:43 IST|Sakshi

లాస్య ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై ధర్మారావు జగతా దర్శకత్వంలో తాడాల వీరభద్రరావు నిర్మిస్తున్న చిత్రం ‘సాగర తీరంలో’. దిశాంత్, ఐశ్వర్య అడ్డాల నాయకా నాయికలుగా నటించారు. కోనసీమలోని ముమ్మడివరం, పాండిచ్చేరి, యానాంలతో పాటు  అనేక ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రనిర్మాత వీరభద్రరావు మాట్లాడుతూ – ‘మా ‘సాగర తీరంలో’ చిత్రం యువతరానికి కనెక్టయ్యే అందమైన ప్రేమకథ. నవ్వులు పండించే కామెడీ, భయపెట్టే హారర్, థ్రిల్‌కు గురిచేసే సస్పెన్స్‌తో పాటు దేశభక్తి మిళితమైన క్లీన్‌ ఎంటర్‌టైనర్‌. నటీనటులందరూ అద్భుతంగా నటించారు’’ అన్నారు. ధర్మారావు మాట్లాడుతూ – ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీశాం. ఎడిటింగ్‌ పూర్తి చేసుకుని డబ్బింగ్‌ చివరి దశలో ఉంది. అతి త్వరలో రిలీజ్‌ తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిషన్‌ సాగర్, సంగీతం: భోలే, సహ నిర్మాతలు: తాడాల శశికళ, నార్ని రామలింగ ప్రసాద్‌.

మరిన్ని వార్తలు