హీరో సాయిధరమ్ తేజ్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నుంచి స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్– జె.పుల్లారావు మాట్లాడుతూ ‘‘సాయి ధరమ్ తేజ్, గోపీచంద్ కాంబినేషన్లో సినిమా నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. ఒక కొత్త జోనర్లో ఈ సినిమా ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ను ధరమ్ తేజ్ ఇదివరకు చేయలేదు. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు.