వారి జీవితాలను రంగులమయం చేయండి : హీరో

2 Mar, 2018 12:38 IST|Sakshi

దేశవ్యాప్తంగా హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ అభిమానులకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే వీరిలో సాయిధరమ్‌ తేజ్ చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. ‘అందరికీ హోలీ శుభాకాంక్షలు. ప్రతిజ్ఞ తీసుకోండి’ అంటూ అవయవధానానికి సంబంధించిన పోస్టర్‌ను ట్వీట్ చేశాడు సాయి.

‘మీకు అంధ ప్రపంచాన్ని రంగులమయం చేయగలిగే శక్తి ఉంది. ప్రతిజ్ఞ చేయండి’ అన్న కామెంట్స్ ఉన్న పోస్టర్‌ను ట్వీట్ చేశాడు సాయి ధరమ్‌ తేజ్‌. పండుగ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్‌పై అభిమానులు, సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇంటిలిజెంట్ సినిమాతో నిరాశపరిచిన సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు.

మరిన్ని వార్తలు