'యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం'

23 Nov, 2017 10:11 IST|Sakshi

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జవాన్. రచయిత బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రయిలర్ ను గురువారం రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు యూత్ ఆడియన్స్ దృష్టి లో పెట్టుకొని సినిమాలు చేసిన సాయి.. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. 

ఓ దేశ ద్రోహిని ఎదుర్కొనేందుకు సిద్ధమయిన యువకుడు తన ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడితే ఎలా రియాక్ట్ అయ్యాడు ఎలా రక్షించుకున్నాడు అనే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు.  అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నరు. ప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జవాన్ డిసెంబర్ 1న రిలీజ్ కు రెడీ అవుతోంది.

మరిన్ని వార్తలు