భాగమతి దర్శకుడితో మెగా హీరో..!

26 Dec, 2018 10:47 IST|Sakshi

కెరీర్‌ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఇటీవల తడబడుతున్నాడు. వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ కష్టాల్లో పడేసుకున్న ఈ మెగా హీరో తదుపరి చిత్రాలు జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం నేను శైలజ ఫేం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సాయి.. తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది.

పిల్ల జమీందార్‌ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అశోక్‌, ఇటీవల భాగమతితో మరో విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు సాయి ధరమ్‌ ఓకె చెప్పాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్రకరణ దశలో ఉన్న చిత్రలహరి సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు