చలో మస్కట్‌

17 Dec, 2017 01:45 IST|Sakshi

బై బై హైదరాబాద్‌... చలో మస్కట్‌ అంటూ సాయిధరమ్‌ తేజ్‌ ఫ్లైట్‌ ఎక్కేశారు. న్యూ ఇయర్‌ని మస్కట్‌లో జరుపుకుంటారని ఊహిస్తున్నారా? అదేం కాదు. షూటింగ్‌ కోసం వెళ్లారు. వీవీ వినాయక్‌ దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్, లావణ్యా త్రిపాఠి జంటగా సి. కల్యాణ్‌ ఓ చిత్రం నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ ముగించుకుని, మస్కట్‌ ప్రయాణమైంది ఈ బృందం.

‘‘ఈ నెల 18 నుంచి 28 వరకూ మస్కట్‌లో రెండు పాటలు చిత్రీకరించబోతున్నాం. ఓ పాటకు జానీ మాస్టర్, మరో పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తారు. మస్కట్‌లో సాంగ్స్‌ షూట్‌ పూర్తి చేసి, ఇండియా రాగానే క్లైమాక్స్‌ మొదలుపెడతాం. ఫిబ్రవరి 9న సినిమాని రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ–మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్, సంగీతం: థమ¯Œ , ఎడిటింగ్‌: గౌతంరాజు, సహనిర్మాతలు: సి.వి. రావు, నాగరాజ పత్సా.

మరిన్ని వార్తలు