మెగాస్టార్ మామయ్య పండుగ ముందే ఖైదీ నెంబర్ 150గా ప్రేక్షకుల ముందుకు వస్తే మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ...సంక్రాంతి పండుగ రోజున ట్రైలర్తో శుభాకాంక్షలు తెలిపాడు. ‘నీలాంటి వాళ్లు అడుగడుగునా ఉంటారు. నాలాంటోడు అదురుగా ఉంటాడు. అదే డేట్, అదే ప్లేస్, అదే టైమ్, అదే ట్రాక్, అదే రేంజ్, నేను రెడీ’ అంటూ సాయిధరమ్ ఎప్పటిలాగే ఎనర్జిటిక్ ఫెర్మామ్మెన్స్తో హల్ చల్ చేశాడు. తనకు జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడం కోసం ఓ యువకుడు పోరాటం చేస్తాడు. అందులో గెలిచి `విన్నర్`గా ఎలా నిలిచాడనేది ఈ చిత్ర కథ.
దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'విన్నర్' ఫస్ట్ ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మినరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), టాగూర్ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వచ్చే నెల 24న విన్నర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సాయిధరమ్ తన ట్విట్టర్లో ట్రైలర్ను పోస్ట్ చేశాడు.