వాట్‌ ఏ ఛేంజ్‌ మావా!

19 Jan, 2018 08:13 IST|Sakshi

సాక్షి, సినిమా : ఇప్పటి తరం హీరోల్లో మెగా ఫ్యామిలీ తరపున సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌లు దూసుకుపోతున్నారు. సినిమాల కోసం కష్టపడే తత్వం అలవాటు చేసుకున్న ఈ ఇద్దరూ ఒకప్పుడు ఎలా ఉండేవారో చాలా మందికి తెలిసే ఉంటుంది.

దానిని గుర్తు చేస్తూ సాయి ధరమ్‌ తేజ్‌ ఈ ఉదయం ఓ పోస్టు చేశాడు. ఈరోజు మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ పుట్టినరోజు.. ఈ సందర్భంగా సాయి వరుణ్‌కు విషెస్‌ చెబుతూ ఓ ఫోటో పెట్టాడు. సినిమాల్లోకి రాకముందు వీరిద్దరూ విపరీతమైన లావు ఉన్న సంగతి తెలిసిందే. ఆపై వీరిద్దరి రూపం బాగా మారిపోయింది. ఆ ఫోటోలతో ఎవరో ఎడిట్‌ చేసిన ఫన్నీ ఫోటోతో వరుణ్‌కి విషెస్‌ చెప్పాడు. 

ఇక ఇండస్ట్రీలో అందరితో స్నేహపూర్వకంగా మెదిలే వరుణ్‌కి పలువురు సెలబ్రిటీలు కూడా విషెస్‌ చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు