'జనతా గ్యారేజ్'లో సీనియర్ నటుడు

22 Feb, 2016 12:09 IST|Sakshi
'జనతా గ్యారేజ్'లో సీనియర్ నటుడు

హైదరాబాద్‌: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'జనతా గ్యారేజ్'లో సీనియర్ నటుడు 'డైలాగ్ కింగ్' సాయికుమార్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ తండ్రి పాత్రను ఆయన పోషించనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మలయాళ నటులు మోహన్‌లాల్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ కు పెదనాన్నగా మోహన్ లాల్ నటించనున్నారని సమాచారం. ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. మార్చి 5 నుంచి ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటారని చిత్ర యూనిట్ తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతున్న 'జనతా గ్యారేజ్'ను ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు.

>