మళ్లీ స్టూడెంట్‌గా 

21 Mar, 2018 00:21 IST|Sakshi
సాయిపల్లవి

సాధారణంగా స్టూడెంట్‌ స్థాయి నుంచి టీచర్‌గా ఎదుగుతారు. కానీ కథానాయిక సాయిపల్లవి మాత్రం మలయాళ సినిమా ‘ప్రేమమ్‌’లో టీచర్‌గా ఎంట్రీ ఇచ్చి కాలేజీ స్టూడెంట్‌గా అలరిస్తున్నారు. ఆల్రెడీ ‘ఫిదా, ఎమ్‌సీఏ’ సినిమాల్లో ఆమె కాలేజ్‌ స్టూడెంట్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఆమె కాలేజీకి వెళ్లడానికి రెడీ అయ్యారని సమాచారం. శర్వానంద్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘‘పడి పడి లేచె మనసు’’లో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ కోల్‌కత్తాలో స్టారై్టంది. ఇందులో సాయి పల్లవి మెడికల్‌ స్టూడెంట్‌గా నటిస్తున్నారని సమాచారం. ఇక్కడ ఇంట్రెస్టింగ్‌ మేటర్‌ ఏంటంటే.. సాయిపల్లవి రియల్‌ లైఫ్‌లోనూ మెడిసిన్‌ స్టడీస్‌ను కంప్లీట్‌ చేశారు. అసలే ఈ మలయాళ బ్యూటీ మంచి నటి. రియల్‌ లైఫ్‌లో ఎలానూ మెడిసిన్‌ చేశారు కాబట్టి.. ఆ అనుభవంతో ఈ పాత్రను అలవోకగా చేసేస్తారని చెప్పొచ్చు. 

మరిన్ని వార్తలు