మలయాళ సినిమా ప్రేమమ్లో మలర్ టీచర్గా నటించి ఒక్క కేరళ ప్రేక్షకులనే కాకుండా తమిళనాడు, ఆంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే తెలుగులో ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టేసిన సాయిపల్లవి టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందింది. అక్కడ వరుస విజయాలను అందుకుంటున్న సాయిపల్లవికి కోలీవుడ్లోనూ అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దర్శకత్వంలో ’కరు’ అనే వైవిధ్య భరిత కథా సినిమాలో నటిస్తోంది. తన అభిమాన నటుడు సూర్య సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎగిరిగంతేసి అంగీకరించింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో కేఈ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 1న పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.
అంతకుముందు ఈ సినిమాలో రకుల్ప్రీత్ సింగ్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. సాయిపల్లవి ఎంపిక కావడంతో రకుల్ప్రీత్సింగ్ లేనట్లేనని అనుకున్నారు. తాజాగా సూర్య సినిమాలో తానూ నటిస్తున్నానని రకుల్ వెల్లడించింది. రకుల్ ఇంతకు ముందు కార్తీకి జంటగా ‘ధీరన్ అధికారం ఒండ్రు’ సినిమాలో నటించింది. ఆ సినిమాని దృష్టిలో పెట్టుకుని రకుల్ డిమాండ్ మేరకు కోటి రూపాయల పారితోషికాన్ని చెల్లించినట్లు సినీ వార్గల సమాచారం. సూర్య చిత్రానికి తెలుగు మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని రకుల్కు మంచి పారితోషికం చెల్లించడంతో పాటు, చిత్రంలో రకుల్ పాత్రకే అధిక ప్రాధాన్యత ఉంటుందంటున్నారు. ఇందులో సాయిపల్లవి పాత్ర ప్లాష్బ్యాక్లో వస్తుందని సమాచారం. ఈ విషయం తెలిసిన సాయిపల్లవి షాక్కు గురైందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.