మరో ఇద్దరు స్టార్‌ వారసుల ఎంట్రీ!

29 Mar, 2016 17:02 IST|Sakshi
మరో ఇద్దరు స్టార్‌ వారసుల ఎంట్రీ!

బాలీవుడ్ స్టార్ దర్శకుడు కరణ్ జోహర్‌ తీసిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌' సినిమా ఇండస్ట్రికి ఏకంగా ముగ్గురు వారసులను అందించింది. ఈ సినిమా ద్వారా అలియా భట్‌, వరుణ్ ధావన్‌, సిద్ధార్థ మల్హోత్రా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా స్టార్లుగా తమను తాము ఫ్రూవ్ చేసుకున్నారు కూడా. ఇప్పుడు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌'కు సీక్వెల్ రాబోతున్నది. ప్రస్తుతం ఇండస్ట్రిలో వినిపిస్తున్న మాట నిజమైతే.. ఈ స్వీకెల్ ద్వారా సైఫ్‌ అలీఖాన్‌, ఆయన మొదటి భార్య అమృతా సింగ్ కూతురు సరా అలీఖాన్‌, షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్‌ హీరోహీరోయిన్‌లుగా ఇండస్ట్రికి పరిచయం కాబోతున్నారు.

అంతేకాదండోయ్‌.. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాహ్నావి కపూర్‌ను కూడా తీసుకోవాలనే ఆలోచన ఉందట. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్టులతో హల్‌చల్ చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లో తన కెరీర్‌ మొదలు పెట్టాలని భావిస్తోందట. అయితే  'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌'కు సీక్వెల్ లో సైఫ్ కూతురు సరా, ఇషాన్‌ను ఇప్పటికే తీసుకున్నట్టు వార్తలు వినిస్తున్నాయి. మరోవైపు కరణ్ జోహర్ మాత్రం ఈ సినిమా నటినటులపై ఎక్కడా నోరువిప్పడం లేదు. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని ఇటీవల కరణ్ అధికారికంగా ప్రకటించాడు. దీంతో స్టార్ వారసులు చాలామంది తమను లాంచింగ్ చేయమని కరణ్‌ను కోరుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు. ఇక షాహిద్ కపూర్ మాజీ ప్రియురాలైన కరీనా సైఫ్‌ అలీఖాన్‌ను పెళ్లాడింది. తాజాగా కరీనా, షాహిద్ 'ఉడ్తా పంజాబ్' సినిమాలో కలిసి నటిస్తున్నారు.