దారి మర్చిపోయిన సైఫ్‌ అలీ ఖాన్‌

19 Sep, 2019 20:44 IST|Sakshi

ముంబై : సినీ తారలు అలా చేసే కొన్ని చిన్న చిన్న పనులు వారి అభిమానుల​కు ఆనందాన్ని కలిగిస్తుంటాయి. ఎంత పెద్ద స్టార్‌ అయినా కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ల సహాయం తీసుకోవాల్సిందే. తాజాగా ఇలాంటి సంఘటనే ఓ స్టార్‌ హీరోకు ఎదురైంది. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌.. భార్య కరీనా కపూర్‌, కొడుకు తైమూర్‌తో కలిసి తన పటౌడి ప్యాలెస్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో ఇంటికి వెళుతూ మార్గ మధ్యలో దారి మరిచిపోయారు. దీంతో కారు నుంచి దిగి రోడ్డుపై వెళ్లే వ్యక్తులను దారి అడిగారు. అనంతరం వారికి కృతజ్ఞతలు తెలిపి వారితో ఫోటో దిగారు.

ఈ నెల 21న కరీనా కపూర్‌ 39వ జన్మదిన వేడుకలు జరపుకోబోతుంది. ఈ సందర్భంగా సైఫ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి భార్య పుట్టిన రోజు వేడుకలను జరపడానికి పటౌడి ప్యాలెస్‌కు బయల్దేరాడు. అయితే డ్రైవర్‌ మధ్యలో దారి తప్పడంతో సరైన మార్గం కోసం సైఫ్‌ ఈ పని చేయాల్సి వచ్చింది. ఇటీవలే మార్చిలో సైఫ్‌ పటౌడీ ప్యాలెస్‌కు వెళ్లడం.. అక్కడ భార్య, కుమారుడుతో సరదాగా గడిపినట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇక సైఫ్ అలీ ఖాన్‌ ‘జవానీ జానేమన్‌’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా నవంబర్‌ 29న విడుదల కానుంది. దీనితోపాటు లాల్‌ కాప్తాన్‌ సినిమాలో సైఫ్‌ కనిపించనున్నారు. కాగా కరీనా కపూర్‌ ... అక్షయ్‌ కుమార్‌, కియారా అద్వానీ, దిల్జిత్ దోసాంజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘గుడ్‌ న్యూస్‌’ సినిమాలో  నటిస్తున్నారు.  

మరిన్ని వార్తలు