సమకాలీన అంశాలతో అందమైన ప్రేమకథ

18 Oct, 2014 23:29 IST|Sakshi
సమకాలీన అంశాలతో అందమైన ప్రేమకథ

ఇటీవలే ‘రోమియా’గా పలకరించిన సాయిరామ్ శంకర్ మరో కొత్త షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తయారవుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని సాయిరామ్ శంకర్ సరసన రేష్మీ మీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ సూపర్‌స్టార్ శరత్‌కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ నెల 21 నుంచి ఈ చిత్రం రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ‘‘అందమైన ప్రేమకథకు సమకాలీన అంశాలను జోడించి, సినిమాగా తీస్తున్నాం’’ అని దర్శకుడు చెప్పారు.
 
 యై వంశీధర్ రెడ్డి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దేపా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘రెండో షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తాం. ఓ ప్రముఖ హీరోయిన్‌పై ప్రత్యేక గీతాన్ని కూడా తీయనున్నాం’’ అని చెప్పారు. సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ, మహత్ నారాయణ్ సంగీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘‘కథ, కథనం, నా వేషభాషలు, పాత్రచిత్రణ-ఇలా ప్రతి అంశంలో వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తూ తీస్తున్న సినిమా ఇది’’ అని సాయిరామ్ శంకర్ నమ్మకంగా చెబుతున్నారు.