జూలై 5న స‌మంత ఫ‌న్ రైడ‌ర్‌

1 Jun, 2019 12:16 IST|Sakshi

స‌మంత అక్కినేని, సీనియర్‌ నటి ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఫాంటసీ మూవీ ఓ బేబీ. బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంత‌ర కార్యక్రమాలు జ‌రుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంబించిన చిత్రయూనిట్ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు.

జూలై 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. అన్ని ఎలిమెంట్స్‌ను మిక్స్‌చేసిన‌ ఔట్ అండ్ ఔట్ ఫ‌న్ రైడ‌ర్‌గా ఈ సినిమా రూపొందించినట్టుగా దర్శక నిర్మాతలు వెల్లడించారు. కుటుంబం, బంధాలు, బంధుత్వాలతో జీవితాన్ని ఎలా గ‌డ‌పాల‌నే విష‌యాల‌ను ఆలోచింప చేసే కోణంలో సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది.

కోరియన్‌ మూవీ మిస్‌ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్షన్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఆర్టిస్టులతో పాటు సాంకేతిక బృందంలోనూ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ప‌నిచేయ‌డం విశేషం.

మరిన్ని వార్తలు