చరణ్ సరసన రాశీ కాదు జెస్సీ..?

12 Dec, 2016 15:17 IST|Sakshi
చరణ్ సరసన రాశీ కాదు జెస్సీ..?

ఇప్పటికే ధృవ సినిమాను పూర్తి చేసిన రామ్ చరణ్, ఆ సినిమా తరువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 9న ధృవ సినిమా రిలీజ్ అవుతోంది. ఆ తరువాత సుకుమార్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది. 1980లలో జరిగే ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎవరిని తీసుకోవాలన్న చర్చ జరుగుతోంది.

ముందుగా ఈ పాత్రకు యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నాను తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. రాశీతో ఫోటోషూట్ కూడా నిర్వహించిన సుకుమార్ ఓ నిర్ణయానికి మాత్రం రాలేకపోయాడు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు సమంత అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట. నాగచైతన్యతో పెళ్లి విషయం బయటకు వచ్చాకా.. తెలుగు సినిమాలు అంగీకరించని సమంత.. చరణ్, సుకుమార్ల సినిమాకు అంగకీరిస్తుందో.. లేదో.. చూడాలి.