కరణం మల్లేశ్వరి బయోపిక్‌

2 Mar, 2020 05:03 IST|Sakshi
కరణం మల్లేశ్వరి, సంజనా రెడ్డి

క్రీడాకారుల జీవితాన్ని కథగా స్క్రీన్‌ మీద చూపించే ట్రెండ్‌ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో కనిపిస్తోంది. తాజాగా ఓ బయోపిక్‌ రెడీ అవుతోంది. వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మన దేశానికి తొలి మెడల్‌ తీసుకొచ్చిన కరణం మల్లేశ్వరిపై ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ నిర్మించనున్నారు. శ్రీకాకుళంలోని ఓ మారుమూల గ్రామం నుంచి దేశానికి తొలి ఒలింపిక్‌ పతాకాన్ని తీసుకొచ్చిన కరణం మల్లేశ్వరి కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చిత్రబృందం భావించిందట. సుమారు 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. ఈ సినిమాలో మల్లేశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.

మరిన్ని వార్తలు