-

చేతబడుల నేపథ్యంలో...

20 Dec, 2013 23:58 IST|Sakshi
చేతబడుల నేపథ్యంలో...

 సంజయ్, తనిష్క జంటగా రూపొందిన చిత్రం ‘కట్ చేస్తే’. పడాల శివసుబ్రమణ్యం దర్శకుడు. ఎం. ఎస్.కుమార్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత చెప్పారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోందని, సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. చేతబడి, బాణామతి నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రం ఇదని దర్శ కుడు చెప్పారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్‌కుమార్, సంగీతం: పూర్ణచంద్,  సమర్పణ: సంజీవరాణి.