21 ఏళ్ల తరువాత సంజు బాబా‌..!

7 Feb, 2019 11:07 IST|Sakshi

బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌ దత్‌, దాదాపు 21 ఏళ్ల తరువాత ఓ సౌత్‌ సినిమాలో నటించనున్నాడు. గతంలో నాగార్జున హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన ‘చంద్రలేఖ’ సినిమాలో సంజయ్‌ దత్‌ అతిథి పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఓ కన్నడ సినిమాలో నటించేందుకు సంజయ్‌ దత్‌ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా ‘కేజీయఫ్‌’.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి భాగానికి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వల్‌ను రూపొందించే పనిలో ఉన్నారు యూనిట్‌. ఈ సీక్వల్‌లో సంజయ్‌ దత్‌ గెస్ట్‌ అపియరెన్స్‌ ఇవ్వనున్నారట. సంజయ్‌ లాంటి క్రేజీ హీరో నటిస్తే సినిమాకు బాలీవుడ్ లో మంచి హైప్‌ వస్తుందనే చిత్రయూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ‘కేజీయఫ్‌ చాప్టర్‌ 2’ను 2020 చివర్లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు