దళపతి తర్వాత మరోసారి

12 Feb, 2019 00:46 IST|Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో చేసే సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ స్పీడ్‌ పెంచారు దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌. ఈ సినిమాకు టాప్‌ టెక్నీషియన్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు కూడా. తాజాగా సంతోష్‌ శివన్‌ ఈ సినిమాకు కెమెరామేన్‌గా ఫిక్స్‌ అయ్యారు. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న టాప్‌ కెమెరామేన్స్‌లో సంతోష్‌ శివన్‌ ముందు వరుసలో ఉంటారు.

‘దళపతి, రోజా, ఇద్దరు, దిల్‌సే’ వంటి గుర్తుండిపోయే సినిమాలకు కెమెరా వర్క్‌ను అందించారు సంతోష్‌. ‘‘రజనీసార్‌తో ‘దళపతి’ చిత్రం తర్వాత మళ్లీ కలసి పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాపై చాలా ఎగై్జటింగ్‌గా ఉన్నాను’’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు సంతోష్‌. 28 ఏళ్ల తర్వాత రజనీ, సంతోష్‌ కలసి పని చేయడం విశేషం. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌  మార్చిలో స్టార్ట్‌ కానుంది. 

మరిన్ని వార్తలు