దక్షిణాది సినీసీమకు... ఆగస్టులో ‘సంతోషం’

19 Jul, 2016 23:57 IST|Sakshi
దక్షిణాది సినీసీమకు... ఆగస్టులో ‘సంతోషం’

సినిమా ఇండస్ట్రీలోని ప్రతిభావంతులకు ప్రతి ఏటా అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తోంది ‘సంతోషం’ వారపత్రిక. ఈ పత్రిక ఆగస్టు 2న పధ్నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని, పదిహేనో ఏట అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా ఆగస్టు 14న హైదరాబాద్‌లో ‘సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్’ వేడుకలు నిర్వహిస్తోంది. పత్రిక అధినేత, ఎడిటర్ సురేశ్ కొండేటి మాట్లాడుతూ- ‘‘తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమా పరిశ్రమ ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాం. నాటి- మేటి నటీనటులు, టెక్నీషియన్స్ ఈ వేడుకలకు వస్తారు. తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని భాషల టాప్ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరవుతారు’’ అని చెప్పారు.