దొంగలకు దొంగ.

9 Jul, 2018 00:30 IST|Sakshi
సప్తగిరి

‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి లేటెస్ట్‌గా ‘గజదొంగ’గా మారనున్నారు. సప్తగిరి హీరోగా డి.రామకృష్ణ దర్శకత్వంలో నంద నందనా బ్యానర్‌పై శర్మ చుక్కా, యెడల నరేంద్ర, జి.వి.యన్‌. రెడ్డి నిర్మించనున్న చిత్రం ‘గజదొంగ’. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ –‘‘సప్తగిరికి కరెక్ట్‌గా సూట్‌ అయ్యే సబ్జెక్ట్‌ ఇది. ఆడియన్స్‌ను అలరించే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ఎన్టీఆర్‌ ‘గజదొంగ’ సినిమాకు, మా చిత్రానికి ఏ సంబంధం ఉండదు. సప్తగిరిది దొంగలకు దొంగలాంటి పాత్ర. ఆగస్ట్‌ ఫస్ట్‌ వీక్‌లో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ వనమాలి, లైన్‌ ప్రొడ్యూసర్‌: ఆర్‌వీవీవీ ప్రసాద్‌.

మరిన్ని వార్తలు