ప్రతి రైతు.. ప్రతి లాయర్‌ చూడాల్సిన సినిమా

5 Dec, 2017 03:33 IST|Sakshi

సప్తగిరి హీరోగా చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ పతాకంపై డా. రవికిరణ్‌ నిర్మించిన ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ చిత్రం గురువారం విడుదల కానుంది. ఇందులో కశిస్‌ వోహ్రా కథానాయిక. ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పరుచూరి బ్రదర్స్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రిలీజ్‌ తర్వాత చాలామంది రచయితలు సప్తగిరి కోసం డిఫరెంట్‌ కథలు రాస్తారు. రామానాయుడుగారు బతికి ఉంటే చరణ్‌ లక్కాకులకు చాన్స్‌ ఇచ్చేవారు. మంచి లీగల్‌ పాయింట్‌ ఉన్న సినిమా ఇది. ప్రతి రైతు, ప్రతి లాయర్‌ చూడాల్సిన సినిమా.

చివరి 45 నిమిషాలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్లు, పాటలను విడుదల చేసిన సెలబ్రిటీలందరికీ థ్యాంక్స్‌. వారి వల్ల సినిమాకు హైప్‌ వచ్చింది. సినిమా హిట్‌ అవుతుందని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది. పరుచూరి బ్రదర్స్‌గారు మంచి డైలాగ్స్‌ రాశారు’’ అన్నారు. ‘‘నేను పరుచూరి బ్రదర్స్‌గారి దగ్గర వర్క్‌ చేశాను. నా తొలి సినిమాకు వాళ్లు డైలాగ్స్‌ రాయడం ఆనందంగా ఉంది’’ అన్నారు చరణ్‌ లక్కాకుల. ‘‘సాయికుమార్‌గారు, శివప్రసాద్‌గారు హీరోలుగా చేసిన ఈ సినిమాలో నేను చిన్న పాత్ర చేసినట్లు అనిపిస్తోంది. పరుచూరి బ్రదర్స్‌ మా సినిమాకు వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతకు రుణపడి ఉంటా’’ అన్నారు సప్తగిరి.

మరిన్ని వార్తలు