లాభాల్లోకి ఎంటరైన సరిలేరు..

17 Jan, 2020 15:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సంక్రాంతికి విడుదలైన మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌ రేంజ్‌లోనే వసూళ్లనూ రాబడుతోంది. ఆరు రోజులకే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్‌ఈవెన్‌ సాధించడంతో పాటు పలు ప్రాంతాల్లో డిస్ర్టిబ్యూటర్లకు లాభాలను పంచుతోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు పండుగ సినిమాల నుంచి పోటీని తట్టుకుంటూ కేవలం ఆరురోజుల్లోనే ఏపీ, తెలంగాణల్లో రూ 112.60 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. మహేష్‌ బాబు సినిమాల్లో తొలివారం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అన్ని ఏరియాల్లోనూ ప్రిన్స్‌ మూవీ నాన్‌ బాహుబలి 2 రికార్డులను కైవసం చేసుకుని సంక్రాంతి ఛాంపియన్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో రూ 75.70 కోట్లకు థియేట్రికల్‌ హక్కులను విక్రయించగా ఆరు రోజుల్లోనే మూవీ రూ 77.94 కోట్ల షేర్‌ను రాబట్టి బయ్యర్లకు లాభాలను పంచింది.

చదవండి : రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్‌ బృందం..

మరిన్ని వార్తలు