భరత్‌, సూర‍్యలను మించిన ‘మహానటి’

8 May, 2018 11:11 IST|Sakshi

అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కీర్తీ సురేష్‌, సావిత్రి పాత్రలో నటించిన ఈ సినిమా రేపు (మే 9న) విడుదలవుతోంది. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిడివి ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. దాదాపుగా మూడు గంటల నిడివితో మహానటి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల విడుదలైన మహేష్ బాబు భరత్‌ అనే నేను 2 గంటల 53 నిమిషాల నిడివితో రిలీజ్‌ అయ్యింది. అల్లు అర్జున్‌ నా పేరు సూర్య 2 గంటల 48 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ రెండు సినిమాల కన్నా మహానటి నిడివి ఎక్కువగా ఉండనుంది. 2 గంటల 56 నిమిషాల నిడివితో మహానటి విడుదలకు రెడీ అయ్యింది. రామ్‌ చరణ్‌ రంగస్థలం మాత్రం మహానటి కన్నా ఎక్కువ నిడివితో 2 గంటల 59 నిమిషాల రన్‌టైంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్‌ అనే నేను, నా పేరు సూర్య సినిమాల విషయంలో సినిమా లెంగ్త్‌పై నెగెటివ్‌ కామెంట్స్ వినిపించాయి. మరి మహానటి అలాంటి కామెంట్స్‌ లేకుండా అలరిస్తుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు