14 ఏళ్లకి సీక్వెల్‌

9 Mar, 2020 03:57 IST|Sakshi
ధనుష్‌

తమిళంలో హీరో ధనుష్‌ – దర్శకుడు సెల్వరాఘవన్‌లది బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌. ‘తుళ్లువదో ఇళమై, కాదల్‌ కొండేన్, పుదు పేటై్ట. మయక్కం ఎన్నా’ వంటి సినిమాలు వీళ్ల కాంబినేషన్‌లో వచ్చాయి. తాజాగా ఐదోసారి ఓ సినిమా కోసం కలిశారు ఈ అన్నదమ్ములు. 2006లో వచ్చిన గ్యాంగ్‌స్టర్‌ చిత్రం ‘పుదు పేటై్ట’. తమిళ గ్యాంగ్‌స్టర్‌ సినిమాల్లో  ‘పుదు పేటై్ట’ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. 14 ఏళ్ల్ల తర్వాత ఈ సినిమాకు  సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు సెల్వరాఘవన్‌. ఈ ఏడాది ద్వితీయార్ధంలో  సెట్స్‌ మీదకు వెళ్లనుందని సమాచారం.

>
మరిన్ని వార్తలు