నా హీరోలను కలిశాను: షారూఖ్‌

14 Oct, 2019 18:29 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడ  సౌదీ అరేబియా చిత్ర పరిశ్రమ నిర్వహించిన ‘జాయ్‌ ఫోరయ్‌ 2019’ కార్యక్రమంలో షారుఖ్‌ పాల్గొన్నారు. సౌదీలోని రియాద్‌లో జరుగుతున్న ఈ వేడుకల్లో ఆదివారం హాలీవుడ్‌ స్టార్‌ జాసన్ మొమోవా, హాంకాంగ్‌ యాక్షన్‌ హీరో జాకీచాన్‌, బెల్జీయం నటుడుజీన్-క్లాడ్ వాన్ డామ్మేలను కలుసుకున్నారు. వారితో కలిసి దిగిన ఫోటోలను తాజాగా షారూఖ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 

Breaking the internet z pic of the day can you name all superstar in this picture? #ShahRukhKhan #TeamShahRukhKhan 😍

A post shared by Team Shah Rukh Khan (@teamshahrukhkhan) on

‘ఆనందాలు అన్ని నావే.. నా హీరోలను కలిశాను’ , ‘ఈ ఫోటోలో ఉన్న సూపర్‌స్టార్‌ పేర్లు తెలుసా’.. అనే ట్యాగ్‌లతో షారూఖ్‌ షేర్‌ చేసిన ఈ ఫోటోలు తన అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు  అభిమానులు షేర్‌ చేసిన ఓ వీడియోలో షారుఖ్‌  తన హీరోలను కలిసే అవకాశాన్ని కల్పించినందుకు కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాల తెలిపారు. అలాగే తన ఆరేళ్ల కుమారుడైన అబ్రామ్‌.. జాస​న్‌ అభిమానని షారుఖ్‌ తెలిపారు.  ఏప్రిల్‌లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్‌ మాట్లాడుతూ.. జీరో వైఫల్యం  నన్ను కాస్తా నిరాశ పరిచింది. దీని నుంచి బయట పడటానికి నాకు కొంచెం సమయం కావాలి. ఈ మధ్యలో సినిమాలు చూడటానికి, పుస్తకాలు చదవడానికి, అలాగే నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాను. అని తెలిపారు. 

Khan, Damme, Chan at the #JoyForum19. The joys all mine as I got to meet my heroes. @jcvd @jackiechan @joyforumksa

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

 సొంత నిర్మాణ సంస్థలో వచ్చిన ‘జీరో’ సినిమా అనంతరం బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ ఇంతవరకు ఏ సినిమాను ఓకే చేయలేదు.  అనుష్కశర్మ, కత్రినాకైఫ్‌ హిరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫిస్‌ వద్ద చతికిలపడిన విషయం తెలిసిందే. దాదాపు 200 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు రూ.100 కోట్ల కనెక్షన్లు కూడా రాలేదు. అయితే సినిమాల విషయం పక్కకు పెడితే షారుఖ్‌ బిజీ బిజీగానే గడుపుతున్నారు.  

మరిన్ని వార్తలు