అర్జున్‌ రెడ్డి ఈజ్‌ కబీర్‌ సింగ్‌

27 Oct, 2018 02:22 IST|Sakshi
షాహిద్‌ కపూర్

‘అర్జున్‌ రెడ్డి’ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతోంది. షాహిద్‌ కపూర్, కియారా అద్వానీ జంటగా తెలుగు వెర్షన్‌ని డైరెక్ట్‌ చేసిన సందీప్‌ రెడ్డి వంగా ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘కబీర్‌ సింగ్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. బిగించి ఉన్న పిడికిలిని లవ్‌ సింబల్‌గా చేసి ఉన్న గుర్తుతో ఉన్న టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. వచ్చే ఏడాది జూన్‌ 21న విడుదల కానున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ‘‘అర్జున్‌రెడ్డి’ ని ప్రేమించారు, అభినందించారు. ఇప్పుడు ‘కబీర్‌ సింగ్‌’ వంతు వచ్చింది. వేచి చూడండి’’ అని షాహిద్‌ కపూర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు