సంక్రాంతికి శ్రీకారం

1 Jul, 2019 00:53 IST|Sakshi
గోపీ, కిశోర్, శర్వానంద్, రామ్‌

వచ్చే ఏడాది సంక్రాంతికి తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే కార్యక్రమాలకు హీరో శర్వానంద్‌ ‘శ్రీకారం’ చుట్టారు. ఆయన హీరోగా నటించనున్న కొత్త చిత్రం ‘శ్రీకారం’.  ఈ సినిమాతో కిశోర్‌ రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. 14రీల్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుకుమార్‌ క్లాప్‌ ఇవ్వగా, ఎన్నారై శశికాంత్‌ వల్లూరి కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

రచయిత సాయిమాధవ్‌ బుర్రా స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఆగస్టు మొదటివారంలో ప్రారంభం కానుంది. మిక్కి జె. మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు యువరాజ్‌ కెమెరామెన్‌. ‘శ్రీకారం’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... శర్వానంద్‌ కెరీర్‌లో హిట్‌ చిత్రాలుగా నిలిచిన ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’(2016), ‘శతమానం భవతి’ (2017) చిత్రాలు సంక్రాంతికి రిలీజైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘రణరంగం’, ‘96’ తెలుగు రీమేక్‌  సినిమాలతో బిజీగా ఉన్నారు శర్వానంద్‌.

మరిన్ని వార్తలు