-

‘అవును ఇది నిజమే.. నేను వస్తున్నా’

1 Aug, 2019 11:54 IST|Sakshi

‘అవును. ఇది నిజం! నా సుదీర్ఘ విరామానికి ముగింపు పలుకుతున్నా.. త్వరలోనే నికమ్మలో నన్ను చూడబోతున్నారు. అభిమన్యు, షిర్లేసేతియా వంటి అద్భుతమైన, ప్రతిభావంతులైన నటులతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు కావాలి. ఇన్నేళ్లుగా నాపై ప్రేమ కురిపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ బాలీవుడ్‌ భామ శిల్పాశెట్టి తన రీ ఎంట్రీని ఖరారు చేశారు. 90 వ దశకం నుంచి బాలీవుడ్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ పొడుగుకాళ్ల సుందరి వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. వీరికి వియాన్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు.

కాగా గత పదమూడేళ్లుగా వెండితెరకు దూరమైనప్పటికీ.. తన యోగాసనాలతో శిల్పాశెట్టి ప్రేక్షకులకు చేరువగానే ఉన్నారు. యోగా వీడియోలు, తన కుమారుడికి సంబంధించిన విషయాల గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో తను త్వరలోనే ఓ సరికొత్త సినిమాతో ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు గురువారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ వార్తా పత్రిక క్లిప్పింగ్‌ను శిల్పా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. నికమ్మ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు షబ్బీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు.

Yesssssssss, it’s true! My sabbatical of 13 long years comes to an end.. I am so excited to announce that the film you will see me next in is #Nikamma , directed by @sabbir24x7 (cast still being finalised) featuring these amazing and talented actors @abhimanyud @shirleysetia @sonypicturesin. Need all your blessings 🙏😇 and Thank you for all the love always💗 #SabbirKhanFilms #ShilpaShettyInNikamma #gratitude #doingwhatilove #lovewhatido #films #backwithabang #love #announcement

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

మరిన్ని వార్తలు