పెళ్లైన ఇన్నిరోజులకు మెట్టినింట్లో శ్రియా!

31 Jan, 2019 16:19 IST|Sakshi

టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా రాణించిన శ్రియా గతేడాది రష్యన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ కొశ్చివ్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి తన మెట్టినింట కాలు పెట్టలేదనీ, ఈ మధ్యే రష్యాకు ఈ జంట వెళ్లిందని తెలుస్తోంది. వివాహమైన ఇన్నిరోజులకు తొలిసారి మెట్టినింట కాలుపెట్టిన శ్రియా అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. తీవ్రమైన చలిలో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. అభిమానులకు తన గురించి అప్‌డేట్స్‌ ఇస్తోంది.

రీసెంట్‌గా ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ మూవీలో అతిథి పాత్రలో మెరిసిన శ్రియా.. రెండు మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. తాజాగా ‘వెంకీ మామా’లో వెంకటేష్‌కు జోడీగా ఎంపికయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రియా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా జోరు కొనసాగిస్తోందని అభిమానులు సంబరపడుతున్నారు.

మరిన్ని వార్తలు