శ్రియ భర్తకు కరోనా లక్షణాలు?

14 Apr, 2020 14:56 IST|Sakshi

మహమ్మారి కరోనా వైరస్‌కు ప్రపంచదేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ లేకపోవడంతో ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఈ క్రమంలో హీరోయిన్‌ శ్రియ భర్తకు కరోనా లక్షణాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై శ్రియ స్పందించారు. తన భర్త ఆండ్రూ కొచీవ్‌ పొడి దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడని తెలిపింది. దీంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆండ్రూ సెల్ఫ్‌ క్వారంటైన్‌లో తమ ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంటున్నాడని పేర్కొంది. 

ఇక స్పెయిన్‌లో ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే వేలాది మంది మృత్యువాతపడ్డారు. కరోనా విజృంభిస్తున్న వేళ తన భర్తకు కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు వివరించింది. అయితే ఇప్పటివరకైతే ఎలాంటి ఇబ్బంది లేదని, ఒకవేళ మరింత ఇబ్బంది ఎదురైతే ఆస్పత్రికి తరలిస్తామని ఆమె తెలిపింది. ఇక లాక్‌డౌన్‌ సమయాన్ని భర్త ఆండ్రూ కొచీవ్‌తో సరదాగా గడుపుతున్నానని శ్రియ  సోషల్‌ మీడియాలో గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు