జోడీ రిపీట్‌?

25 Apr, 2020 04:13 IST|Sakshi
ఎన్టీఆర్, శ్రుతీహాసన్‌

‘అరవిందసమేత వీరరాఘవ’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో కథానాయికగా ఇప్పటివరకు పూజా హెగ్డే, కియారా అద్వానీల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలోని హీరోయిన్‌ పాత్ర కోసం శ్రుతీహాసన్‌ పేరు కూడా చిత్రబృందం పరిశీలిస్తోందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. దాదాపు ఏడేళ్ల క్రితం వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన ఓ కథానాయికగా శ్రుతీహాసన్‌ నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఈ జోడీ కుదురుతుందా? వెయిట్‌ అండ్‌ సీ.

మరిన్ని వార్తలు