మామిడికాయ పప్పు ఎంతో ఇష్టం

20 May, 2020 11:09 IST|Sakshi

దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక కొంతమంది వంట చేయటం నేర్చుకుంటూ అందులో ప్రావిణ్యం సంపాదిస్తున్నారు. మరికొంత మంది రకరకాల వెరైటీ వంటలు ట్రై చేస్తూ కుటుంబ సభ్యులను సంతోషపెడుతున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వృత్తి, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే సినీ సెలబ్రిటీల్లో హీరోయిన్‌  శృతి హాసన్ ముందు వరసలో ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శృతి హాసన్‌ తనకు ఎంతో  ఇష్టమైన హైదరాబాద్‌ తెలుగు వంటకం ‘మామిడికాయ పప్పు’ను చేశారు. (తారక్‌కు బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌‌ స్పెషల్‌ విషెస్‌..)

The EASIEST mango pappu!! I love this so much I had it for the first time when I visited Hyderabad as a kid and feel in love ❤️ it’s super easy to make hits make sure the raw mango turns translucent so you know it’s done ! Add spice according to your Taste but I keep it mild so I can proper taste the mango :) yummy 😋

A post shared by @ shrutzhaasan on

అదేవిధంగా తాను స్వయంగా చేసిన ‘మామిడికాయ పప్పు’ వీడియాను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు శృతి హాసన్‌.  ‘చాలా సులభంగా చేసే మామిడికాయ పప్పు నాకు చాలా ఇష్టం. నేను చిన్నతనంలో హైదరాబాద్‌కి మొదటిసారి వచ్చినప్పుడు ఈ మామిడికాయ పప్పును తిన్నాను. ఇక ఈ వంట చేయటం చాలా సులభం. మీ రుచికి తగినట్లు మసాలా వేస్తే చాలా బాగుంటుంది. నేను మాత్రం చాలా తక్కువగా మసాలాను వేస్తాను. ఎందుకంటే సహజమైన మామిడికాయ రుచిని ఆస్వాదించాలి’ అంటూ కామెంట్‌ జత చేశారు శృతి హాసన్‌. ఇక తాను లాక్‌డౌన్‌ సమయంలో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో భాగంగా ఇంటికే పరిమితయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్‌’ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది.    

మరిన్ని వార్తలు