హలో హాలీవుడ్‌

21 Jun, 2019 00:31 IST|Sakshi
శ్రుతీహాసన్‌

గతంలో కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చి పర్సనల్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేశారు శ్రుతీహాసన్‌. లండన్‌లో కొన్ని మ్యూజిక్‌ షోలు నిర్వహించారు. యాక్టింగ్‌కు ఇచ్చిన విరామానికి  ఫుల్‌స్టాప్‌ పెట్టి మళ్లీ యాక్టింగ్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. తమిళంలో విజయ్‌ సేతుపతితో ఓ సినిమా, తెలుగులో రవితేజతో ఓ సినిమా అంగీకరించారు శ్రుతీహాసన్‌. తాజాగా ఓ ఇంటర్నేషనల్‌ టీవీ సిరీస్‌లోనూ నటిస్తున్నారని తెలిసింది. హాలీవుడ్‌లో ‘బోర్న్‌’ సిరీస్‌లో 5 చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రాల తరహాలోనే ‘ట్రెడ్‌ స్టోన్‌’ అనే సిరీస్‌ను రూపొందిస్తున్నారు. మైఖేల్‌ ఫోర్బ్స్, మైఖేల్‌ గ్యాస్టన్, బ్రైన్‌ జె. స్మిత్‌ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

ఇటీవలే బుడాపెస్ట్‌లో ఈ సిరీస్‌ ప్రీ ప్రొడక్షన్‌ స్టార్ట్‌ అయింది. ఇంటర్నేషనల్‌ స్పై మిషన్‌ కథాంశంగా రూపొందనున్న ఈ సిరీస్‌లో శ్రుతీహాసన్‌ ఢిల్లీకి చెందిన నీరా పటేల్‌ పాత్రలో కనిపిస్తారు. పగలంతా హోటల్‌లో వెయిట్రెస్‌గా కనిపించి రాత్రి హత్యలు చేసే కిల్లర్‌గా మారతారట. త్వరలోనే ఈ సిరీస్‌ షూటింగ్‌లో శ్రుతీహాసన్‌ పాల్గొననున్నారు. యూఎస్‌ టీవీ సిరీస్‌లో నటించనున్న తొలి సౌతిండియన్‌ హీరోయిన్‌ కూడా శ్రుతీహాసనే కావడం విశేషం. ఇంతకుముందు ‘క్వాంటికో’ అనే టీవీ సిరీస్‌లో ఉత్తరాది భామ ప్రియాంకా చోప్రా కనిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

మరిన్ని వార్తలు