శృతికి జాక్‌పాట్‌

20 Jun, 2019 10:13 IST|Sakshi

నటి శృతీహాసన్‌ బ్రేక్‌ను బ్రేక్‌ చేయనున్నారు. హిందీ, తెలుగు, తమిళం అంటూ వరుస పెట్టి చిత్రాలు చేసిన ఈ సంచలన హీరోయిన్‌ ఆ తరువాత సుమారు రెండేళ్లు తెరపై కనిపించలేదు. అంతే కాదు నటనకు బ్రేక్‌ ఇచ్చారు. తరచూ బాయ్‌ఫ్రెండ్‌తో కనిపిస్తూ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశారు. అయితే తాను సినిమాల్లో నటించకపోయినా ఖాళీగా లేనని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ తన ఫ్రెండ్స్‌తో కలిసి సంగీత ఆల్బమ్స్‌ రూపొందించుకుంటున్నట్లు వెల్లడించారు.

ఆ మధ్య బుల్లితెరపై రియాలిటీ షోలో వ్యాఖ్యాతగా మెరిశారు. ఈ అమ్మడు కోలీవుడ్‌లో చివరిగా సింగం 3లో కనిపించారు. అదేవిధంగా తెలుగులో పవన్‌కల్యాణ్‌తో కాటమరాయుడు చిత్రంలో నటించారు. ఇక తన తండ్రి స్వీయ దర్శకత్వంలో నటించిన శబాష్‌నాయుడులో నటించినా, ఆ చిత్రం మధ్యలోనూ ఆగిపోయింది. ఆ తరువాత కొన్ని చిత్రాలను నిరాకరించారనే ప్రచారం హోరెత్తిన విషయం తెలిసిందే. 

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్‌ అయిన తరువాత ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు శృతి. కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి సరసన ఒక చిత్రం, టాలీవుడ్‌లో రవితేజ్‌తో ఒక చిత్రం అంగీకరించారు.  అవును ఈ అందాల భరిణి హాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చే జాక్‌పాట్‌ను కొట్టేసిందని తెలిసింది. ఒక హాలీవుడ్‌ సిరీస్‌లో ముఖ్య పాత్రలో నటించడానికి ఓకె చెప్పారు శృతి. ప్రఖ్యాత లాసన్‌ బోర్మీ యూరనివర్స్‌ సంస్థ నిర్మించనున్న ట్రెడ్‌స్టోన్‌ సిరీస్‌లో శృతిహాసన్‌ నటించనున్నారు.

ఈ సిరీస్‌లో ఢిల్లీలో ఒక హోటల్‌లో పని చేస్తూ ఇతర సమయాల్లో హత్యలు చేసే యువతిగా నటించనుందని సమాచారం. హంగేరీలోని బుడాపెస్ట్‌ ప్రాంతంలో జరగనున్న ఈ సిరీస్‌ షూటింగ్‌లో త్వరలోనే శ్రుతిహాసన్‌ పాల్గొననున్నారు. మొత్తం మీద నటనకు కాస్త బ్రేక్‌ ఇచ్చిన ఈ అమ్మడిప్పుడు ఆ బ్రేక్‌ను బ్రేక్‌ చేస్తున్నారన్న మాట.

మరిన్ని వార్తలు