షూటింగ్ పూర్తి చేసుకున్న ‘శుభలేఖ+లు’

8 Jul, 2018 11:40 IST|Sakshi

కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో అదే జానర్‌లో మరో ఇంట్రస్టింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శుభలేఖ+లు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ల వీడియోలను  కూడా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశారు చిత్రయూనిట్‌. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇప్పటికే లీడ్‌ క్యారెక్టర్స్‌ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని, దిక్ష శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శరత్‌ నర్వాడే దర్శకత్వం వహిస్తున్నారు. హనుమ తెలుగు మూవీస్ బ్యానర్‌ పై విద్యా సాగర్‌, ఆర్‌ ఆర్‌ జనార్థన్‌ లు నిర్మిస్తుండగా కే ఎమ్‌ రాథాకృష్ణన్‌ సంగీతమందిస్తున్నారు.

మరిన్ని వార్తలు