లాయర్‌ రేఖ

22 Jun, 2020 00:55 IST|Sakshi
శ్వేతాబసు ప్రసాద్‌

ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్లు ఆ ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమంత, తమన్నా,  ప్రియమణి, కాజల్‌ అగర్వాల్, అమలాపాల్‌ వంటి హీరోయిన్లు  వెబ్‌ సిరీస్‌లలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘కొత్తబంగారు లోకం’ ఫేమ్‌ శ్వేతాబసు ప్రసాద్‌ ఈ జాబితాలో చేరిపోయారు. ‘డాక్టర్‌ డాన్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో రేఖ అనే లాయర్‌ పాత్రలో కనిపించనున్నారు శ్వేతాబసు. 1995–2003 మధ్యకాలంలో ఐఐటీ, ఏమ్‌బీబీఎస్, ఐఏఎస్, ఐపీఎస్‌ ఎంట్ర¯Œ ్స ఎగ్జామ్స్‌ పేపర్స్‌ను లీక్‌ చేయడంలో ఓ ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి జీవితం ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ రూపుదిద్దుకోనుందని బాలీవుడ్‌ సమాచారం.

ఈ విషయంపై శ్వేతాబసు మాట్లాడుతూ–‘‘ఆత్మవిశ్వాసం, మానసిక బలం మెండుగా ఉన్న లాయర్‌ రేఖ పాత్రలో నటించడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను. నమ్మిన వ్యక్తే విల¯Œ కు సాయం చేస్తున్నాడని రేఖ తెలుసుకునే సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయి. కొన్ని కథలకు ఇప్పటి రోజుల్లో వెబ్‌ సిరీస్‌లే సరైనవి’’ అన్నారు శ్వేతాబసు ప్రసాద్‌. ‘కొత్తబంగారులోకం’ (2008) సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయి¯Œ  శ్వేతాబసుప్రసాద్‌. ఆ తర్వాత తెలుగులో ‘కాస్కో’ (2009), ‘రైడ్‌’ (2009) వంటి చిత్రాల్లో నటించారు. ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా..’(2012) చిత్రం తర్వాత శ్వేతాబసు ప్రసాద్‌ మరో తెలుగు సినిమాలో నటించలేదు.

మరిన్ని వార్తలు