శింబు కొత్త చిత్రం

30 Jul, 2013 05:07 IST|Sakshi
శింబు కొత్త చిత్రం
 యువ దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో సంచలన నటుడు శింబు హీరోగా నటించనున్నారు. పోడాపోడి తర్వాత శింబు నటించిన చిత్రాలేవీ తెరపైకి రాలేదు. వేట్టైమన్నన్, వాలు చిత్రాలు చాలా కాలంగా నిర్మాణంలోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో శింబు నూతన చిత్రం ప్రారంభం కానుందన్న వార్త ఆయన అభిమానుల్లో ఆనందం నింపింది. 
 
 కేడీ బిల్లా కిల్లాడి రంగా వంటి విజయవంతమైన చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. తాజాగా శింబుతో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీనికి శింబు తమ్ముడు కురలరసన్ సంగీతం అందించనున్నారనే ప్రచారం జరుగుతోంది. శింబు పాటలు రాస్తున్నట్లు సమాచారం. ఆషాడమాసం వెళ్లిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పాండిరాజ్ తెలిపారు. ఇప్పుడు ప్రచారం అవుతున్న వార్తలన్నీ వదంతులేనని కొట్టిపారేశారు.