సిమ్రాన్ మళ్లీ వస్తోంది!

21 Dec, 2013 00:17 IST|Sakshi
సిమ్రాన్ మళ్లీ వస్తోంది!

 ఒకప్పుడు సిమ్రాన్ తెలుగు తెరపై క్రేజీ హీరోయిన్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్‌బాబు లాంటి అగ్రహీరోలందరితోనూ నటించింరామె. పెళ్లి తర్వాత దాదాపుగా సినిమాలకు దూరమయ్యారు. అయితే ఈమధ్య తమిళంలో కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నారు. త్వరలో తెలుగుతెరపై కూడా ఆమె తళుక్కుమనబోతున్నారు. నాని హీరోగా యశ్‌రాజ్ సంస్థ నిర్మిస్తున్న ‘ఆహా కల్యాణం’లో ఆమె ఓ ముఖ్యపాత్ర పోషించారు. అంటే ఈ సినిమా తర్వాత సిమ్రాన్ తెలుగులో విరివిగా నటించినా ఆశ్చర్యపోనవసరం లేదు.