ధృవలో అరవింద్ స్వామికి డబ్బింగ్ ఎవరు..?

12 Dec, 2016 15:10 IST|Sakshi
ధృవలో అరవింద్ స్వామికి డబ్బింగ్ ఎవరు..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా.. అరవింద్ స్వామి విలన్గా కనిపించనున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఎంతో మందిని సంప్రదించిన తరువాత ఒరిజినల్ వర్షన్లో నటించిన అరవింద్ స్వామినే ఆ పాత్రకు తీసుకున్నారు.

అయితే ఇంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్కు తెలుగులో డబ్బింగ్ ఎవరు చెపుతున్నారు. అన్న చర్య జరుగుతోంది. తమిళ నటుడైన అరవింద్ స్వామి తెలుగులో స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోలేడు. అందుకే తెలుగులో ఈ పాత్రకు ఓ యువ గాయకుడితో డబ్బింగ్ చెప్పించారట. గతంలో స్నేహితుడు సినిమాలో విజయ్కి డబ్బింగ్ చెప్పిన గాయకుడు హేమచంద్ర, ధృవ సినిమాలో అరవింద్ స్వామికి డబ్బింగ్ చెపుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో హేమచంద్ర వాయిస్కు మంచి మార్కులే పడ్డాయి.