7 కోట్ల విరాళం

5 Apr, 2020 03:05 IST|Sakshi
పింక్‌

 ప్రముఖ హాలీవుడ్‌ గాయని, పాటల రచయిత్రి, నటి పింక్‌ తాను కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రకటించారు. కరోనాపై పోరాటం కోసం దాదాపు 7 కోట్లు  విరాళం ప్రకటించారు. కొన్ని వారాల క్రితమే పింక్, ఆమె మూడేళ్ల కుమారుడు జేమ్సన్‌కి కరోనా లక్షణాలు కనిపించాయట. 2 వారాలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత ఇటీవలే కోలుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసి, 7 కోట్ల విరాళాన్ని కూడా ప్రకటించారు. అందులో 3.5 కోట్లు ఫిలడెల్ఫియా లోని టెంపుల్‌ యూనివర్శిటీ ఆసుపత్రికి, మిగతా 3.5 కోట్లను  లాస్‌ ఏంజెల్స్‌ మేయర్స్‌ ఎమర్జన్సీ ఫండ్‌కి అందజేస్తున్నట్టు తెలిపారు పింక్‌.
 

మరిన్ని వార్తలు