ఇంటి సంఘటన తెరకు!

29 Nov, 2018 02:19 IST|Sakshi

దర్శకుడు, నటుడు యస్‌.జె. సూర్య, ప్రియా భవాని శంకర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మాన్‌స్టర్‌’. ‘ఒరు నాళ్‌ కూత్తు’ ఫేమ్‌ నెల్సన్‌ వెంకటేశన్‌ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ‘మాయా– మా నగరం’ అనే చిత్రాన్ని నిర్మించిన పొటెన్షియల్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మాణ సంస్థ తమ మూడవ ప్రయత్నంగా ఈ చిత్రాన్ని రూపొందించనుంది.

దర్శకుడు నెల్సన్‌ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా ఓ రోజు మా ఇంట్లో ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటనకు నేను చాలా ఇన్‌స్పైర్‌ అయ్యి స్క్రిప్ట్‌గా రాసుకున్నాను. బాలల నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఇప్పుడు ఇంతకంటే కథ గురించి వేరే విషయాలు ఏమీ చెప్పలేను. యస్‌. జె సూర్య నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా గత చిత్రం ‘ఒరు నాళ్‌ కూత్తు’లో సీరియస్‌ పాత్ర పోషించిన కరుణాకరన్‌ ఈ చిత్రంలో తన నటనతో కామెడీ కితకితలు పెడతాడు’’ అన్నారు.

మరిన్ని వార్తలు