బిగ్‌బాస్‌: మూడింట్లో ‘ఆర్మీ’లదే గెలుపు

1 Oct, 2018 10:57 IST|Sakshi
బిగ్‌బాస్‌ విన్నర్స్‌

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ సీజన్‌-2 తెలుగు టైటిల్‌ను కౌశల్‌ గెలుచుకున్న విషయం తెలసిందే. ఆయన విజయంలో కౌశల్‌ ఆర్మీ కీలక పాత్ర పోషించింది. గెలిపించడమే కాదు దాదాపు ఈ రియాల్టీ షోను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంది. సోషల్‌ మీడియా వేదికగా వీరు చేసిన హంగామ అంత ఇంత కాదు. తమ అభిమాన కంటెస్టెంట్‌ జోలికి వచ్చిన ఎవ్వరిని వదిలిపెట్టలేదు. ఆఖరికి హోస్ట్‌ నానిని కూడా. ఒక్క తెలుగులోనే కాదు.. ఈ సోషల్‌ మీడియా వేదికగా ఏర్పాటైన ఆర్మీల ప్రభావం.. అటు తమిళం, మలయాళంలోను కనిపించింది. నిజానికి ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ను సోషల్‌ మీడియానే శాసించింది. మూడు భాషల్లో తమ అభిమాన కంటెస్టెంట్స్‌ పేరిట ఏర్పాటైన ఆర్మీలే గేమ్‌ ఆడించాయి. (చదవండి: బిగ్‌బాస్‌ విజేత కౌశల్‌)

తెలుగులో కౌశల్‌ ఆర్మీ.. మళయాళంలో సబు ఆర్మీ, తమిళంలో రిత్వికా ఆర్మీలే పై చేయి సాధించాయి. మూడు భాషల్లో ఫైనల్‌ ఆదివారమే జరగగా.. మూడింట్లో ఈ ఆర్మీలే అంతిమ విజయం సాధించాయి. మలయాళంలో సబుమోన్‌ అబ్దుసమద్‌ టైటిల్‌ గెలవగా.. తమిళంలో రిత్వికా విజయం సాధించింది. ఇక ఫైనల్లో ఈ మూడు ఆర్మీ గ్రూప్‌లు ఒకరికి ఒకరు మద్దతుగా ప్రచారం చేసుకున్నాయి. భాషతో సంబంధం లేకుండా మీ అభిమాన కంటెస్టెంట్స్‌కు మేం ఓట్లేస్తున్నాం.. మీరు మాకేయ్యండి అని ఈ మూడు గ్రూప్‌లు క్యాంపెన్‌ నిర్వహించాయి. (చదవండి: ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్‌ ఇలా..)

గత తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌లో ఓవియా కంటెస్టెంట్‌కు మద్దతుగా తొలిసారి ఓవియా ఆర్మీ ఏర్పాటైంది. అక్కడి నుంచి తొలిసారి దక్షిణ భారత దేశంలో ఈ ఆర్మీ సంస్కృతి పుట్టుకొచ్చింది. కొన్ని కారణాల వల్ల ఓవియా ఆర్మీ ఆమెను గెలిపించలేకపోయింది. కానీ ఈ సారి ఏర్పాటైన ఆర్మీలు మాత్రం విజయవంతంగా తమ అభిమాన కంటెస్టెంట్స్‌ను గెలిపించాయి. (చదవండి:  కౌశల్‌ ఆర్మీ భారీ ర్యాలీ)

మరిన్ని వార్తలు